జగిత్యాల : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామశివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బైక్ ఢీకొని బాలుడితో సహా ఇద్దరు దుర్మరణం చెందారు. కోరుట్ల ప్రాంతానికి చెందిన సద్దాం కుటుంబ సభ్యులతో కలిసి కారులో జగిత్యాల వైపు వెళ్తున్నాడు. మోహన్రావు పేట శివారులో కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కారు సీటు మధ్యలో ఇరుక్కుపోయి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జగిత్యాల జిల్లా దవాఖానకు తరలించారు. సద్దాం పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ అపోలో దవాఖాన తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.