నారాయణపేట: జిల్లాలోని మరికల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మరికల్ మండలంలోని అప్పంపల్లిలో కారు, డీసీఎం ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను మహబూబ్నగర్ జిల్లా దవాఖానకు తరలించారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. మృతులు సతీష్ (55), రవి శంకర్ (50)గా గుర్తించారు. వారు కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా పుట్పాక్ గ్రామానికి చెందినవారని వెల్లడించారు. సతీష్ ఫుట్పాక్లో వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యారని తెలిపారు. హైదరాబాద్ నుంచి వారి స్వగ్రామం వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జానారెడ్డి గతం.. టీఆర్ఎస్ భవిష్యత్తు: బాల్క సుమన్
దేశంలో కొత్తగా 62 వేల కరోనా కేసులు
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్గివెన్ షిప్ కాస్త కదిలింది
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!