Crime
- Jan 28, 2021 , 09:34:02
VIDEOS
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం

అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జగ్గంపేట మండలం మల్లిసాల వద్ద ఓ కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద ధాటికి విద్యుత్ తీగలు తెగి కారుపై పడ్డాయి. దీంతో కారులో మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గోకవరం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- చిన్నారుల విద్యకు సోనూ సూద్తో చేతులు కలిపిన ఎంఐ మొబైల్స్
- మొలకలు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది
- బౌద్ధమతం ప్రపంచ శాంతికి ప్రతీక
- అగ్ని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఐపీఎస్ దంపతులు
- వాలంటీర్లపై ఎస్ఈసీ ఆంక్షలు
- అల్లం రసాన్ని మనం రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?
- ప్రియావారియర్ కు ఫస్ట్ మూవీనే ‘చెక్’ పెట్టిందా..!
- బెంగాల్లో బీజేపీ కార్యకర్త తల్లిపై దాడి
- మల్లన్న దర్శనం..పులకరించిన భక్తజనం
- 'Y' మోషన్ పోస్టర్ విడుదల
MOST READ
TRENDING