Crime
- Dec 12, 2020 , 10:52:01
గజ్వేల్లో బస్సు, బైకు ఢీ.. ఇద్దరు మృతి

సిద్దిపేట: జిల్లాలోని గజ్వేల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గజ్వేల్ మండలంలోని జాలిగామ శివారులో ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపోలు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మంద ప్రసాద్, ఎర్రోళ్ల డేవిడ్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారి బంధువులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుంటున్నారు.
తాజావార్తలు
- కరోనా టీకా తీసుకున్న ఆశా వర్కర్కు అస్వస్థత
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క
- మీర్జాపూర్ టీంకు నోటీసులు.. అమెజాన్ ప్రైమ్కు మరిన్ని కష్టాలు..!
- కోబ్రా ఫోర్స్లోకి మహిళల్ని తీసుకుంటున్నాం..
- శాండల్వుడ్ డ్రగ్ కేసు.. నటి రాగిణి ద్వివేదికి బెయిల్
- షార్ట్సర్య్కూట్తో యూరియా లారీ దగ్ధం
- రైల్వే కార్మికులతో స్నేహభావంగా మెలిగాం : మంత్రి కేటీఆర్
- పీపీఈ కిట్లో వచ్చి 13 కోట్ల బంగారం దోచుకెళ్లాడు
- కాబోయే సీఎం కేటీఆర్కు కంగ్రాట్స్ : డిప్యూటీ స్పీకర్ పద్మారావు
- హరిహరన్ మెడలోని డైమండ్ చైన్ మాయం..!
MOST READ
TRENDING