పెద్దపల్లి : చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకున్నది. పూసల గ్రామ తాళ్లచెరువు వద్ద ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతి చెందారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామానికి చెందిన గుర్రాల ప్రశాంత్ ఇద్దరు కూతుళ్లు శాన్వి (6), అనుశ్రీ (3) చెరువులో పడడంతో గమనించిన స్థానికులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వెంటిలేటర్ సదుపాయం లేకపోవడంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చిన్నారులను తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఇద్దరు పిల్లల మృతితో కుటుంబీకుల రోధనలు మిన్నంటగా.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.