మెదక్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తీసుకొని ఇద్దరు పిల్లలు మృతి చెందాగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే…తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన బుల్లె మల్లేశం, బుల్లె బాలమ్మ వారి పిల్లలు మనీషా, కుమార్ బతుకు దేరువు కోసం వచ్చి మనోహరాబాద్లోని ఓ కోళ్ల ఫారంలో పనిచేస్తున్నారు.
కాగా, మంగళవారం ఫారంలోని కోళ్లను వండుకొని తిన్నారు. వారు వండుకున్న ఆహారం కలుషితం కావడంతో తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డారు. చికిత్స కోసం తూప్రాన్ దవాఖానకు వెళ్లే సరికి చిన్నారులు మనీషా (13), బుల్లె కుమార్ (10) మృత్యువాత పడ్డారు. తల్లి బాలమ్మ పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Minister KTR : బీజేపీ దరఖాస్తు ఉద్యమంపై మంత్రి కేటీఆర్ సెటైర్
New Zealand: ఆరు నెలల తర్వాత తొలి కరోనా కేసు.. మూడు రోజుల లాక్డౌన్
Rain Alert : తెలంగాణలో నేడు భారీ వర్షాలు