మేడ్చల్ : జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను చోరీచేస్తున్న ఇద్దరిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 11 బైకులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం నిజాంపేట వద్ద బైక్పై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా కొంతకాలంగా నిజాంపేట పరిసర ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్నట్లు అంగీకరించారు. దీంతో నిందితులను రిమాండ్కు తరలించారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో వీరు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.