మెహిదీపట్నం : అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని హబీబ్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ నరేందర్ కథనం ప్రకారం….మంగళ్హాట్ మచిలీపురాకు చెందిన జె అనిల్సింగ్ (47), జె శంకర్సింగ్(42) మంగళవారం ఉదయం సీతారాంబాగ్ ఫ్రెండ్స్ కేఫ్ ప్రాంతం నుంచి అనుమానాస్పద స్థితిలో నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకుని సోదా చేశారు.
వారి వద్ద ఉన్న ట్రావెల్స్ బ్యాగులలో రెండు కిలోల రెండు వందల యాభై గ్రాముల గంజాయి లభ్యమైంది. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును హబీబ్నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.