మెహిదీపట్నం : గంజాయి తరలిస్తున్న ఇద్దరిని గోల్కొండ పోలీస్ స్టేషన్ పోలీసులు పట్టుకుని వారి వద్ద 3 కిలోల గంజాయిని, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…..గోల్కొండ మొహల్లాగంజ్లో నివసించే మహ్మద్ నవీద్పాష (42), హుస్సేన్షావలి దర్గా ప్రాంతంలో నివసించే మహ్మద్ అజమీర్ (25) లు ఆటో డ్రైవర్లు.
వీరికి అక్రమంగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచన రావడంతో గంజాయిని తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు షేక్పేట్ ఓయూ కాలనీలో వీరిద్దరిని గోల్కొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 3 కిలోల గంజాయి, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.