హైదరాబాద్ : నగరంలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్పై సమాచారం అందుకున్న సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి యోగేష్, ధర్మేందర్సింగ్లను అదుపులోకి తీసుకున్నారు. జియాగూడకు చెందిన మరో నిందితుడు సాయి పరారీలో ఉన్నాడు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు రూ.76 వేల నగదు, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.