హైదరాబాద్ : తక్కువ ధరకే బంగారం అంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తనిఖీల్లో పట్టుబడ్డ బంగారాన్ని కస్టమ్స్ అధికారుల నుంచి తక్కువ ధరకే ఇప్పిస్తానని చెబుతూ వీరు మోసాలకు పాల్పడుతున్నారు. సుధాకర్, నాగార్జునరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు రూ.32 లక్షలు వసూలు చేసి పరారయ్యారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వీరి వద్ద నుంచి రూ.25 లక్షలు, 4 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.