లక్నో: కవల సోదరులు అపార్ట్మెంట్ బిల్డింగ్లోని 25వ అంతస్తు పైనుంచి కిందపడి మరణించారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో శనివారం ఈ ఘటన జరిగింది. సిద్ధార్థ్ విహార్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని 25వ అంతస్తులోని ఇంట్లో ఒక కుటుంబం నివాసం ఉంటున్నది. తండ్రి ఆఫీస్ పనిమీద ముంబై వెళ్లాడు. తల్లి, కుమార్తె, 14 ఏండ్ల కవల సోదరులు శనివారం రాత్రి ఇంట్లో నిద్రించారు.
అయితే అర్ధ రాత్రి తర్వాత కవల సోదరులైన సత్యనారాయణ, సూర్యనారాయణ 25వ అంతస్తు పైనుంచి కిందపడి చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. తమ ఇంటి ఫ్లోర్ పైనుంచి కవల సోదరులు ఎలా కిందపడ్డారు అన్నది తెలియలేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. చనిపోయిన కవల సోదరులు 9వ తరగతి చదువుతున్నట్లు వెల్లడించారు.