సిటీబ్యూరో, జూలై 6(నమస్తే తెలంగాణ): సోషల్మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. అవకాశం ఉన్న ప్రతి దాన్ని వినియోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు.. ఏటీఎం కార్డు, కేవైసీ అప్డేట్ అం టూ, రుణాలు ఇప్పిస్తామంటూ, బహుమతులు పంపిస్తున్నామంటూ, అతి తక్కువ ధరకే బ్రాండెడ్ దుస్తులం టూ, ఇలా వివిధ పేర్లు చెప్పి.. నమ్మించి దోచేస్తున్నారు.. ఇలా ఆరు నెలల్లో రూ.23 కోట్లు కొట్టేశారు.. దీంతో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.. ఇక ఎవరూ కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోకుండా అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. ఇందులో భాగంగా అపార్టుమెంట్లు, కాలనీలు, కంపెనీలు తదితర ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.. ఇలాంటి మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సీపీ సజ్జనార్ 10 సూత్రాలను విడుదల చేశారు.. ఈ సూత్రాలను పాటించి ఇక ఎవరూ కూడా సైబర్ నేరగాళ్లబారిన పడకుండా ఉండాలని సూచించారు.
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సైబరాబాద్ పోలీసులు మంగళవారం నుంచి కాలనీలు, అపార్ట్మెంట్లు, కంపెనీలు తదితర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. ఎవరికైనా అనుమానాలు ఉన్నా, అవగాహన కావాలనుకున్నా ట్విట్టర్ – CyberCrimePSCyb, ఇన్స్టాగ్రాం- cbercrimes.cyberabad, వాట్సాప్ – 9490 617310, ఫేస్బుక్ – Cybercrimepscyb లలో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు. వాట్సాప్ లేదా 040-27854031 నంబర్లో ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు సైబర్ క్రైం అధికారులను సంప్రదించవచ్చు. ప్రతి స్టేషన్ పరిధిలో ఇక ప్రజలను నేరుగా కలిసి ఈ 10 సూత్రాలను వివరిస్తున్నారు. ఈ సరికొత్త కార్యక్రమాన్ని సీపీ సజ్జనార్ మంగళవారం ప్రారంభించారు.