మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేపలు పట్టడానికి వెళ్లి ఇద్దరు బాలికలు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..దూలపల్లిలో స్థానికంగా ఉండే బాలికలు సంజన(13), కరీనా(12) దూలపల్లి క్వారీ నీటిగుంతలో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలించగా ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
రాఘవపూర్ పీహెచ్సీకి జాతీయ అవార్డు
సురేందర్ రెడ్డికి నివాళులు అర్పించిన ఎంపీ సంతోష్ కుమార్
అంతర్జాల వేదికగా..ఎన్టీఆర్కు ఘన నివాళులు
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
రైతులకు జనుము విత్తనాలు పంపిణీ
నారాయణపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత