మెదక్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ రవికాంత్ తెలిపిన వివరాల ప్రకారం..మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన మంద నర్సింలు (32) తన ద్విచక్ర వాహనంపై తూప్రాన్కు బయలుదేరాడు. మార్గమధ్యలో శివ్వంపేట మండలం శభాష్పల్లి శివారులోకి రాగానే టిప్పర్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో నర్సింలు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ పై తాను తాగి..
రామప్పను సందర్శించిన మంత్రులు, పురావస్తు శాఖ అధికారులు
జడ్చర్లలో భారీగా గుట్కా పట్టివేత
మహబూబాబాద్ జిల్లాలో 120 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత