సంగారెడ్డి : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద సంఘటన మునిపల్లి మండలంలోని లింగంపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్వర్రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కోహిర్ మండలంలోని కోత్తుర్-డి గ్రామానికి చెందిన కాంపల్లి రాజు(33) లింగంపల్లి గ్రామానికి కాలినడకన వెళ్తున్నాడు. ఈ క్రమంలో జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొనండంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. లింగంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద డ్రైవర్గా విధులు నిర్వహించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తండ్రి చనిపోవడంతో మృతుడి పిల్లలు కన్నీరు మున్నీరు అయ్యారు. మృతుడి భార్య శారద పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తూ చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ఇవి కూడా చదవండి..
దారుణం.. సాయంత్రం కూతురి పెళ్లి.. ఉదయం తండ్రి మృతి
తల్లిని వదిలేసిన కొడుకులు..అక్కున చేర్చుకున్న పోలీసులు
హరితహారం మొక్కలు ధ్వంసం.. రూ. 5వేల జరిమానా
కీలక అంశాలపై చర్చకు మోదీ సర్కార్ వెనుకంజ!
Tokyo Olympics: చరిత్రలో ఇంతకు మించిన విజయం ఉండదేమో..!
మెడికల్ హబ్గా మారనున్న మహబూబ్నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్