వరంగల్ రూరల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపాడ్ గ్రామ శివారులోని పాకాల వాగులో చంద్రుతండాకు చెందిన తేజావత్ రామ్ సింగ్ (60) గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు.. పశువులను మేపడం కోసం వెళ్లి వాగు దాటే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు వాగులో పడిన రామ్ సింగ్ గల్లంతయ్యాడు.
స్థానికుల సమాచారంతో గజ ఈతగాళ్లు వాగులో వెతికి రామ్ సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామ్సింగ్ మృతితో చంద్రుతండాలో విషాదం నెలకొంది.
ఇవి కూడా చదవండి..
మొక్కలు నాటే ప్రక్రియ ఆగస్టు నెలాఖరు లోగా పూర్తి : మంత్రి ఎర్రబెల్లి
Rain Alert : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
టీకాల కొరత : 45 ఏండ్లు పైబడిన వారిలో 50 శాతం మందికే తొలి డోసు!