వరంగల్ : నీటిలో ఆడుకోవాలన్న సరదా ఆ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని నర్సంపేట మండలం మాదన్నపేటలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పుట్ట రాహుల్ (23) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి మాదన్నపేట చెరువు వద్దకు వెళ్లాడు.
సరదా కోసం చెరువులోకి దిగటంతో ప్రమాదవశాత్తు రాహుల్ నీటిలో మునిగి మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహం వెలికి తీయడం కోసం గాలింపు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీస్, రీస్క్యూ టీంను ఆదేశించారు.
రాహుల్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడు రాహుల్ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
మతంతో సంబంధం లేకుండా.. ఆ హక్కు మేజర్లకు ఉంది
ఇవాళ ఆకాశంలో అద్భుతం.. ఆ మూడు ఖగోళ రాశులూ ఒకేచోట..
వివాదంలో అమెరికా రియాల్టీ షో.. క్షమాపణలు చెప్పిన ప్రియాంకా చోప్రా