ములుగు : ట్రాక్టర్ బోల్తా పడటంతో 14 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని వెంకటాపురం మండలం రాచపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ఛత్తీస్గఢ్ రాష్ట్రం నాంపల్లి గ్రామం నుంచి జిల్లాలోని ఒంటిమామిడిపల్లి గ్రామంలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో 14 మందికి స్వల్ప గాయాలు కావడంతో ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏటూరునాగారం ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతూ.. వాగులో పడి యువకుడు మృతి
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవు : మంత్రి పువ్వాడ