ఖమ్మం : జిల్లాలోని కల్లూరి మండలం పెద్దకోరుకొండ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం తాటిచెట్టుపై నుండి పడి ఓ గీతకార్మికుడు మృతిచెందాడు. మృతుడిని బండి కొండయ్యగా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి ఉన్నారు. సాయంత్రం గ్రామంలో వర్షం పడింది. చెట్టు ఎక్కే క్రమంలో కాళ్లకున్న బంధం ఒక్కసారిగా జారడంతో కొండయ్య అంత ఎత్తు నుంచి కిందపడిపోయాడు. గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు.