ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్లోని బయోలాజికల్ పార్కులో దారుణం జరిగింది. రాయల్ బెంగాల్ టైగర్.. 35 ఏండ్ల వయసున్న జూ సిబ్బందిపై దాడి చేసి చంపేసింది. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో టైగర్ ఉన్న కేజ్లోకి ప్రవేశించి వాటర్ ట్యాంక్ను శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలోనే అతనిపై పులి దాడి చేసింది. అయితే పులి ఉన్న బోను మూడు గేట్లు తెరిచి ఉండటంతోనే ఈ ఘటన జరిగినట్లు జూ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. సిబ్బంది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు.