నిర్మల్: జిల్లాలోని దిలావర్పూర్ లో గల కాల్వ లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి భక్తులు కానుకగా ఇచ్చిన ఆవులమందపై సోమవారం అర్ధరాత్రి చిరుత పులి దాడి చేసినట్లు ఆలయ ఈవో సదయ్య తెలిపారు. ఉదయం ఆలయానికి చేరుకున్న పండితులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పులిదాడిలో ఓ ఆవు మృతి చెందగా, మరొకటి తీవ్రంగా గాయపడినట్లు వారు తెలిపారు. ఆలయ చైర్మన్ చిన్నయ్య అక్కడికి చేరుకొని ఆవుల మందను పరిశీలించి, అనంతరం అటవీశాఖ సమచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. చిరుత పులి దాడిలో ఆవు మృతి చెందిందని గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
విద్య ద్వారానే సమాజంలో మార్పు : ఎమ్మెల్సీ కవిత
రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం
ప్రజలకు సుపరిపాలన అందించేందుకే కలెక్టరేట్ల నిర్మాణం
పల్లె ప్రగతి పెండింగ్ పనులు 19 లోపు పూర్తి చేయాలి