భోపాల్: కరోనా రోగులకు అత్యవసర సమయాల్లో ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ ఘటన జరిగింది. స్థానిక జేకే ఆసుపత్రి నుంచి రెమ్డెసివర్ ఇంజెక్షన్లు పక్కదారి పడుతున్నాయి. అక్కడి సిబ్బంది నుంచి వీటిని అందుకుంటున్న కొందరు వాటిని బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదు రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.