దిస్పూర్: అసోంలో ఓఎన్జీసీకి చెందిన ముగ్గురు ఉద్యోగులను దుండగులు ఎత్తుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున రాష్ట్రంలోని శివ్సాగర్ జిల్లాలోని లాక్వా క్షేత్రం నుంచి సాయుధులైన గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు ఉద్యోగులను కిడ్నాప్ చేశారని ఓఎన్జీసీ ప్రకటించింది. వారిలో ఇద్దరు జూనియర్ ఇంజినీర్లు, ఒక జూనియర్ టెక్నీషియన్ ఉన్నారని, వారు ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్నారని వెల్లడించింది. దుండగులు వారిని కంపెనీకి చెందిన ఆపరేషనల్ వాహనంలో తీసుకెళ్లారని తెలిపింది. దానిని అసోం-నాగాలాండ్ సరిహద్దుల్లోని నిమోనగఢ్ అటవీ ప్రాంతంలో వదిలివెళ్లారని పేర్కొంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని ప్రకటించింది. పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలంలో ఉన్నారని వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..