ఇక్ష్వాకులు (క్రీ.శ.220-300)
శాతవాహనుల సామ్రాజ్య పతనానంతరం వారి సామంతుల్లో ఒకరైన ఇక్ష్వాకులు తెలంగాణ-కోస్తాంధ్ర ప్రాంతంలో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. చివరి శాతవాహన రాజైన నాలుగో పులోమావిని ఇక్ష్వాక రాజు శ్రీశాంతమూలుడు తొలగించి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. వీరి శాసనాలు, నాణేలు దొరికిన ప్రదేశాలను బట్టి వారి సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు, తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ వరకు విస్తరించిందని చెప్పవచ్చు. వీరు నాగార్జునకొండ లోయలోని విజయపురిని రాజధానిగా చేసుకున్నారు. ఇక్ష్వాకుల రాజ చిహ్నం సింహం.
ఆధారాలు
పురాణాల్లో ఈ వంశానికి చెందిన ఏడుగురు రాజులు పేర్కొన్నారు. కానీ శాసనాలను బట్టి నలుగురి పేర్లే తెలుస్తున్నాయి.
పురావస్తు ఆధారాలు: నాగార్జున కొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డి పల్లి, ఫణిగిరి మొదలైన చోట్ల దొరికిన శాసనాలు వీరి చరిత్రకు ముఖ్యమైన ఆధారాలుగా ఉన్నాయి. ఈ శాసనాలు ప్రాకృత భాషలో, బ్రాహ్మీ లిపిలో రాసి ఉన్నాయి. ఎహూవల శాంతమూలుడి కాలం నుంచి శాసనాలు సంస్కృతంలో లిఖించి ఉన్నాయి. ఇక్ష్వాకుల నాణేలు నాగార్జున కొండ, ఫణిగిరి, నేలకొండపల్లి, వడ్డమాను, ఏలేశ్వరం మొదలైన చోట్ల దొరికాయి. నాగార్జున కొండ తవ్వకాల్లో ఇక్ష్వాకుల కాలం నాటి కోట, బౌద్ధ స్థూపాలు, విహారాలు, చైత్యాలు, ఆరామాలు, దేవాలయాలు, స్నానఘట్టాలు మొదలైనవి ఎన్నో బయటపడ్డాయి.
ప్రాక్టీస్ బిట్స్
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
ఇవీ కూడా చదవండి…