మనేసర్ : మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. మటన్ కొనుగోలు చేసేందుకు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో బయటకి వచ్చిన యువతి(20)ని బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది.
మటన్ కోసం బయటకు వచ్చిన ముగ్గురు స్నేహితులను తమ వాహనంలోకి బలవంతంగా ఎక్కించుకున్న దుండగులు వారిని పంట పొలంలోకి లాక్కెళ్లి ఆమె స్నేహితులను కట్టిపడేసి బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై దారుణ ఘటన గురించి బాధితురాలు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. నిందితులను గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని మనేసర్ మహిళా పోలీస్ స్టేషన్ అధికారి పూనం హుడా పేర్కొన్నారు.