హైదరాబాద్: తెలంగాణలోని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుగొండ తండాలో విషాదం చోటు చేసుకుంది. మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. బాధితులు తమ బంధువు దిన కర్మలకు వెళ్లి కల్తీ మద్యం తాగినట్లు సమాచారం.
తర్వాత అస్వస్థతకు గురైన బాధితులను దవాఖానకు తరలించారు. వారు దవాఖానకు చేరుకునే లోపు ఇద్దరు మరణించారు. మరొకరు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించాడు. మ్రుతుల్లో మల్సూర్, హరిదాసు, మరొకరు ఉన్నారు.