అమరావతి : విశాఖలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. విశాఖ ఆరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో శనివారం ఉదయం అతివేగంగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
నూతన సంవత్సర వేడుకల సుందర్భంగా ఎలాంటి ఘటనలు జరుగ కుండా బీఆర్టీఎస్ రోడ్డును శుక్రవారం రాత్రి నుంచి మూసివేసి శనివారం ఉదయం తెరిచారు. రోడ్డును తెరిచిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరగడం స్థానికులను కలిచివేసింది.