హైదరాబాద్ : నగరంలో వ్యాపారుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఇరాన్ ముఠా సభ్యులను ఎల్బీనగర్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 35 వేల నగదు, 811 యూఎస్ డాలర్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. వస్త్ర వ్యాపారం కోసం ముగ్గురు ఇరాన్ వాసులు కొంతకాలం క్రితం ఢిల్లీకి వచ్చినట్లు ఆయన తెలిపారు. కరోనా లాక్డౌన్ కారణంగా వ్యాపారం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక హైదరాబాద్ వచ్చి వీరు చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో గుర్తించినట్లు పేర్కొన్నారు. డాలర్లు తీసుకొని రూపాయలు ఇవ్వాలని మోసాలకు పాల్పడ్డారు. హైదరాబాద్లో 2 నెలల్లో 5 చోట్ల వీరు చోరీలు చేశారని సీపీ వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.