యాదాద్రి భువనగిరి : జిల్లాలోని భువనగిరి పట్టణంలో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 20 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని బీదర్ నుండి వీటిని తీసుకువచ్చి స్థానికంగా, హైదరాబాద్లోని వినియోగదారులకు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. నిందితులను ఫీర్జాదీగూడకు చెందిన కె.సురేశ్, బోడుప్పల్కు చెందిన కె.రాహుల్, భువనగిరి పట్టణానికి చెందిన పి.మనరామ్గా గుర్తించారు. బీదర్కు చెందిన మరో నిందితుడు అబ్బు పరారీలో ఉన్నాడు.