రామగిరి, మే 13: కరోనాతో ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడుతుండడంతో సర్కార్ ఆర్థిక భరోసా కల్పించింది. యూ-డైస్లో నమోదు కాని వారికి సైతం రెండో విడుతలో సాయమందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో విద్యాశాఖ అందుకు అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసి గురువారం పంపించింది. సీఎం కేసీఆర్ పూర్తిగా మానవీయ కోణం ఆలోచనకు దర్పణం పడుతుండగా ఉమ్మడి జిల్లాలో మరో 4,702 మంది కి లబ్ధి కలుగనుంది.
తొలి విడుతలో యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యు కేషన్(యూ-డైస్) ఆధారంగా నెలకు రూ.2 వేలు, 25 కిలోల సన్నబియ్యం ప్రభుత్వం అందించింది. యూ-డైస్తో సంబంధం లేకుండా మిగిలిన ఉపాధ్యాయులు, సిబ్బందికి ఈ నెల 15లోగా రెండో విడుత సాయమందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన జాబితాను ఈనెల 13లోగా రాష్ట్ర విద్యాశాఖకు పంపించాలని జిల్లా అధికారులకు సూచించింది. జాబితా తయారుతో జిల్లా విద్యాశాఖ సమర్పించింది.
అనాలోచిత వైఖరితో..
యూ-డైస్లో నమోదు కాని వివరాలను ఏప్రిల్ 10 నుంచి 15 వరకు ఆన్లైన్ లో నమోదు చేయాలని అధికారులు సూచించారు. క్లస్టర్ రిస్సోర్స్పర్సన్(సీఆర్పీ), ఎంఈఓలు తెలిపినప్పటికీ కొందరు యాజమాన్యాలు అనాలోచితంగా యూ-డైస్లో లేని బోధన, బోధనేతర సిబ్బంది వివరాలను నమోదు చేయలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో వెయ్యిమందికిపైగా నష్టపోతున్నట్లు తెలుస్తున్నది. గత మాసం ఫిజికల్ వెరిఫికేషన్(ప్రత్యక్షవిచారణ) సందర్భంలో దరఖాస్తులు ఇచ్చినప్పటికీ వారికి వివరాలు ఆన్లైన్లో కాకు ండా మళ్లీ యూ-డైస్లోనే నమోదు చేయడంతోనే సమస్య వచ్చినట్లు తెలుస్తున్నది. అధికారులు, యాజమాన్యాల సమన్వయలోపంతో టీచర్స్, సిబ్బందికి నష్టం జరిగింది.
ఉమ్మడి జిల్లాలో సాయం ఇలా…
ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడుత 9,352 మంది పొందారు. రెండో విడుతలో 4,702 టీచర్స్, సిబ్బంది సాయం పొందనున్నారు. రెండో విడుతకు సంబంధించి విద్యాశాఖ పంపిన వివరాల్లో వారికి ఈనెల 15లోగా వారి వ్యక్తిగత ఖాతాల్లోకి రూ. 2వేలు, రేషన్ దుకాణాల ద్వారా 25 కిలోల సన్నబియ్యం ఉచితంగా అందనున్నాయి. దీంతో ఆ కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.