అమరావతి : చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీసులు మహిళ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మహిళను ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని వాహనంలో తీసుకువచ్చి చంద్రగిరి అటవీ పరిధిలోని బావిలో పడేశారు. తిరిగి వెళ్తుండగా అటవీశాఖ సిబ్బంది గుర్తించి అనుమానంతో ప్రశ్నించారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమదైన శైలీలో విచారించగా మహిళను హతమార్చి మృతదేహాన్ని పడేసేందుకు వచ్చినట్లు అంగీకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. విచారణ కొనసాగుతుందని, కేసు పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తామని తెలిపారు.