కంది: తోషిబా కంపెనీలో పని చేస్తున్న ప్రసాద్ గౌడ్ అనే ఓ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంపెనీలోని పై అధికారులు రాజేశ్, సంపత్, కొండల్ వేధింపులు తట్టుకోలేక, మానసిక క్షోభకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోటులో పేర్కొన్నాడు. అతడి స్వగ్రామం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తంగడపల్లి.
ప్రసాద్ గౌడ్ రుద్రారం సమీపంలోని తోషిబా కంపెనీ లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. శక్తుల విషయంలో తనను వేధిస్తున్నారని పేర్కొంటూ సెల్ఫీ వీడియో తీసి, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ సంగతి తెలుసుకున్న పోలీసులు కంపెనీలోని ముగ్గురు అధికారుల గురించి వివరాల సేకరణపై ద్రుష్టి పెట్టారు. బాధితుల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని రూరల్ ఎస్సై సుభాష్ చెప్పారు.
మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు అందిన తర్వాత కేసు నమోదు చేసుకుంటామన్నారు. అందుకు గల కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.