మేడ్చల్ మల్కాజిగిరి : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో అంబేద్కర్ నగర్లోని ఓ ఇంటి కిటికీలు పగలగొట్టి లోనికి చొరబడి రూ.80వేలు నగదు ఎత్తుకెళ్లారు. శ్రీరామ్ నగర్లోని వినాయకుడి గుడిలో ఆంజనేయుడి విగ్రహం, దుర్గామాత వెండి విగ్రహలు చోరీ చేశారు.ఈ రెండు విగ్రహాలు సుమారు కేజీ వరకు ఉంటాయని స్థానికులు తెలిపారు. గంట వ్యవధిలో రెండు చోరీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, సీసీటీవీలో ఇద్దరు వ్యక్తులు చోరీ చేసినట్లు విజువల్స్ రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఛత్తీస్గఢ్ పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
పేదల కడుపు నింపేందుకే కొత్త రేషన్ కార్డులు
Tokyo Olympics: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా
గంభీర్కు చుక్కెదురు.. స్టే ఇవ్వలేమన్న సుప్రీం