బండ్లగూడ : కంటి శస్త్ర చికత్స కోసం సొంతూరికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడి నగదు,బంగారం ఎత్తుళ్లిన సంఘటనలో రాజేంద్రనగర్ పోలీసులు దొంగను అరెస్టు చేసి గురువారం రిమాండ్కు తరలించారు.ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం…రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ సాయిరాం నగర్లో నివాసం ఉండే ఇందిరా గత నెల 27న కంటి చికిత్స కోసం అనంతపురం వెళ్లి తిరిగి బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చింది.
అమె ఇంటికి చేరుకునే సరికి ఇంటికి మరొక తాళం వేసి ఉండటంతో అమె అనుమానంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించింది. ఇంట్లో ఉన్న అల్మారాలు తెరిచి ఉండటంతో అమె దొంగతనం జరిగినట్లు గ్రహించి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో లక్షా 30 వేల నగదుతో పాటు బంగారం గోలుసులు పోయినట్లు పిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇంటి వాచ్మెన్ను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నాడు.దీంతో నిందుతుడు కిరణ్కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.అతని నుంచి 81 వేల నగదు,2.2తులల బంగారం స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.