యాదాద్రి భువనగిరి : జిల్లాలోని బొమ్మలరామారం మండలంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని ప్యారారం గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై దొంగలు దాడి చేశారు. మహిళ కాళ్ల కడియాలు, వెండి గాజులు అపహరించుకుపోయారు. దొంగల దాడిలో మహిళ గాయపడింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం భువనగిరి ఆస్పత్రికి తరలించారు.