నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ బస్టాండ్లో శుక్రవారం భారీ చోరీ జరిగింది. బంగారం, వెండి, నగదు ఉన్న బ్యాగుతో వ్యాపారి బస్సు ఎక్కాడు. కాగా బ్యాగును సీటులో పెట్టి టికెట్ కోసం డ్రైవర్ వద్దకు వెళ్లగా ముగ్గురు దొంగలు బ్యాగుతో ఊడాయించారు. బాధిత వ్యాపారి బోధన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బ్యాగులో 41 తులాల బంగారం, 7 కిలోల వెండి, రూ.లక్ష ఉన్నట్లుగా తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.