న్యూఢిల్లీ: ఇండియన్ నేవీలో ఖాళీగా ఉన్న సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సెయిలర్ విభాగంలో సీనియర్ సెకండరీ రిక్య్రూట్ (ఎస్ఎస్ఆర్), ఆర్టిఫిసర్ అప్రెంటిస్ (ఏఏ) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని ప్రకటించింది. గతేడాది 2700 పోస్టులను భర్తీ చేసింది. ఇప్పుడు కూడా ఇంతే స్థాయిలో పోస్టులు ఉండనున్నాయి. దీనికి సంబధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 26 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్ష విధానం వంటి వివరాలను అందులో వెల్లడిస్తారు.
అర్హతలు: 60 మార్కులతో ఇంటర్ పాసవ్వాలి. నిర్ణీత ప్రమాణాల ప్రకారం శరీరధారుడ్యం కలిగి ఉండాలి.
స్టయిఫండ్: ట్రైనింగ్ సమయంలో ప్రతినెల రూ.14,600 ఇస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్. రాతపరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక్క మార్కు చొప్పున 100 ప్రశ్నలు అడుగుతారు. గంటలోపు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోతవిధిస్తారు. పరీక్ష హిందీ, ఇంగ్లిష్లో ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ.215, ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 26
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 30
వెబ్సైట్: www.joinindiannavy.gov.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి