జయశంకర్ భూపాలపల్లి : మనోవేదనతో జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన భూపాలపల్లి మండలంలోని గంగారం గ్రామంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ సుధాకర్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తెప్పల పాపయ్య- లలిత దంపతులకు కుమారుడు తెప్పల అనిల్ (23), కూతురు ఉంది.
అనిల్ కొద్ది రోజులుగా ముబావంగా ఉంటున్నాడు. కాగా, శుక్రవారం రాత్రి స్నేహితుడి ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి అనిల్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో వెతకగా బావి దగ్గర చెప్పులు కనిపించాయి.
దీంతో వారు బావిలో వెతకగా మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
తేనెటీగల దాడిలో గీత కార్మికుడి మృతి
కరోనాతో కొడుకు.. తట్టుకోలేక తండ్రి మృతి
అంబులెన్స్లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
దళారుల బెడద అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలు
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు