తిర్యాణి : మండలంలోని చింతలమాధర జలపాతంలో యువకుడు గల్లంతైన సంఘటన ఆదివారం తిర్యాణి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమరి గ్రామానికి చెందిన దయా అమీత్ ప్రతాప్ దరి(17) అనే యువకుడు మిత్రులతో కలసి చింతల మాధర జలపాతం చూడటానికి వచ్చాడు. సరదాగా తన స్నేహితులతో కలసి నీటిలో దిగాడు. రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు.
ఈ విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజఈతగాళ్ల సాయంతో నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు. వర్షం కురుస్తుండటంతో పాటు చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.