జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయ కాలనీకి చెందిన కృష్ణంరాజు (25) సంవత్సరాల యువకుడు సుభాష్ కాలనీలోని రామాలయం ప్రాంతంలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకతీయ కాలనీకి చెందిన రేణికుంట్ల కృష్ణంరాజు గత కొన్ని నెలల నుంచి మస్థిమితం లేకుండా తిరుగుతూ ఉండేవాడు.
అతడిని హైదరాబాద్లోని ఎర్రగడ్డ దవాఖానలో ఉంచి తన అన్నదమ్ములు చికిత్స అందిస్తున్నారు. కృష్ణంరాజు తండ్రి చనిపోయిన తర్వాత వారి కుటుంబం హైదరాబాద్ లో నివసిస్తున్నారు.
రెండు రోజుల క్రితం కృష్ణంరాజు హైదరాబాద్ నుంచి కాకతీయ కాలనీకి వచ్చి సుభాష్ కాలనీలో తిరిగాడని, శుక్రవారం రామాలయ పరిసర ప్రాంతంలో చనిపోయి కనిపించాడని స్థానికులు తెలిపారు. భూపాలపల్లి ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా
సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి పూజలు
భారత్కు చేరిన అమెరికా అత్యవసర సాయం