కల్లూరు : అనుమానాస్పదంగా ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన కల్లూరు వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్సై రఫీ తెలిపిన వివరాల ప్రకారం.. పెనుబల్లి మండలం కరాలపాడు గ్రామానికి చెందిన మేకల రవి (28) కల్లూరులోని వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవారం మృతి చెంది పడి ఉన్నాడని, ఈ విషయాన్ని అటుగా వచ్చిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంత ఎస్సై రఫీ సిబ్బందితో అక్కడకు చేరుకుని రవికుమార్ మృతదేహాన్ని పరిశీలించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రవికుమార్ మృతిచెందిన తీరు అనుమానాస్పందంగా ఉందని, దీనిపై పూర్తి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.