మేడ్చల్ మల్కాజిగిరి : ప్రమాదవశత్తు కరెంట్ షార్ట్ సర్క్యూట్తో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శామీర్పేట మండలంలోని తూముకుంటకు చెందిన సునీల్కుమార్(22) మేడ్చల్ మండలంలోని దేవరాయంజల్లో పాన్షాప్లో వర్కర్గా పని చేస్తున్నాడు. రోజువారి పనిలో భాగంగా మంగళవారం రాత్రి షాపు మూసే సమయంలో పాన్షాప్ డబ్బాపై ఉన్న సామన్లను తీసేందుకు ప్రయత్నిస్తుండగా.. ప్రమాదవశత్తు విద్యుత్ తీగ తగలడంతో కరెంటు షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. సునీల్కుమార్ బావ అమర్నాథ్సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
350 కిలోల గంజాయిని దగ్ధం చేసిన పోలీసులు
మావోయిస్టు నేత రావుల రంజిత్ లొంగుబాటు
కోహ్లిని మించిన బాబర్ ఆజం.. పాకిస్థాన్ కెప్టెన్ కొత్త రికార్డు
బైక్ను ఢీ కొట్టిన లారీ..ఇద్దరు అన్నదమ్ముల మృతి
కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం