మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెరువులో మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు..బౌరంపేట చెరువులో నుంచి బర్రెలను బయటకు పంపే క్రమంలో ప్రమాదవశాత్తు సంతోష్(24) అనే యువకుడు అందులోనే మునిగి చనిపోయాడు. బౌరంపేటకు చెందిన సంతోష్, వినోద్ ఆదివారం సాయంత్రం బర్లను మేత కోసం పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లారు.
చెరువులోకి వెళ్లిన బర్లను బయటకు తీసేందుకు సంతోష్ యత్నించే క్రమంలో ప్రమాదవశాత్తు అందులోనే మునిగి చనిపోయాడు. స్నేహితుడు వినోద్ ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన మహబూబాబాద్ పోలీసులు
ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
కూలీల ఆటో బోల్తా ..నలుగురికి తీవ్ర గాయాలు