సిద్దిపేట : క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. కండ్ల ముందే చెట్టంతా కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, తొబుట్టువు పుట్టెడు దు:ఖంతో తల్లడిల్లారు. పుట్టిన రోజు కానుకగా బైక్ కొనివ్వలేదని కారణంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అక్కన్నపేట మండలంలోని సోమాజితండాకు చెందిన భూక్య అఖిల్(19) ఈ నెల 18న పుట్టిన రోజు. కాగా, తన పుట్టిన రోజు కానుకగా బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగాడు. ఇందుకు తల్లిదండ్రులు ప్రస్తుతం డబ్బులు లేవని సర్ది చెప్పారు.
దీంతో అఖిల్ నిరాండబరంగా తన పుట్టిన రోజును జరుపుకున్నాడు. తిరిగి 19న ఉదయం పది గంటల వరకు నిద్ర లేవకపోవడంతో తండ్రి భూక్య లక్ష్మణ్ కొపగించాడు. అనంతరం అఖిల్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి వచ్చిన అఖిల్ తన సోదరితో తాను పురుగుల మందు తాగనని చెప్పాడు. వెంటనే తను విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు 108 ద్వారా హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు అప్పటికే అఖిల్ మృతి చెందాడని తెలిపారు. మృతుడు అఖిల్ తండ్రి లక్ష్మణ్ తన కొడుకు పుట్టిన రోజు కానుకగా బైక్ కొనివ్వలేదని కారణంతో ఆత్మహత్య చేసుకొన్నాడనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కొత్తపల్లి రవి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
72 టీఎంసీలకు చేరిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్
కరోనాతో చనిపోయింది 4 లక్షలు కాదు.. 40 లక్షల మంది!
భారీగా పతనమైన అదానీ షేర్స్…కారణం ఇదే..!
రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన