బేగంపేట్ : బంగారం దుకాణంలో వాయిదా డబ్బులు చెల్లించి తిరిగి ఇంటికి బయలుదేరిన ఓ ప్రైవేట్ పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు అదృశ్యమైన సంఘటన మంగళవారం మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై లక్ష్మయ్య తెలి పిన వివరాలు ఇలా ఉన్నాయి. నేరేడ్మెట్ తూర్పు చంద్రగిరి కాలనీలో నివాసం ఉంటున్న ప్రవీణ్మోర్ (49) ముషీరా బాద్లోని డీసెంట్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఈ నెల 18న ఉదయం పాఠశాలకు వచ్చింది.
అదే రోజు జీతం డబ్బులు రావడంతో సాయంత్రం మూడు గంటలకు స్కూల్ ముగిసిన తర్వాత సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని ఓ బంగారం దుకాణంలో వాయిదా డబ్బులు రూ. 10వేలు చెల్లించింది. తిరిగి ఆమె ఇంటికి వెళ్లలేదు. కుటుంబ సభ్యులు అమె కోసం వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. అమె కుమార్తె తల్లికి ఫోన్ చేయగా ఫోన్ ఇంట్లోనే ఉన్నట్లు తేలింది. అక్కడే ఒక లేటర్ కూడా కనిపించింది.
తన భర్త 2015 నుంచి ఓ మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని ఎంత చెప్పిన అతనిలో మార్పు రావడం లేదని అందుకే తాను ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్నానని ఆ లెటర్లో రాసినట్టు గుర్తించారు. వెంటనే అమె కుమార్తే నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు అక్కడ జీరో ఎఫ్ఐఆర్ చేసి అనంతరం మార్కెట్ పోలీసులకు కేసు బదిలీ చేశారు. మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసుకోని ప్రవీణ్మోర్ కోసం గాలిస్తున్నారు.