మెహిదీపట్నం : కూతురును అత్తారింటికి తీసుకువచ్చిన తండ్రి అదృశ్యం అయిన సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం….కడప జిల్లాకు చెందిన షేక్ఖాజా హుస్సేన్ (59) ఈ నెల 24న లంగర్హౌస్ సర్దార్బాగ్లోని తన అల్లుడి ఇంటికి కూతురును తీసుకువచ్చాడు.
సాయంత్రం తాను కడపకు తిరిగి వెళుతున్నా అని చెప్పి వెళ్లాడు. రెండు రోజులైనా కడపకు తిరిగి వెళ్లలేదు. దీంతో అల్లుడు తన మామ కనిపించడం లేదంటూ లంగర్హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.