పహాడీషరీఫ్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై హయ్యూం వివరాల ప్రకారం పోలీస్స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో నివాసముంటున్నఅమూల్య(19) దిల్సుఖ్నగర్లోని ఆదిత్య డిగ్రీ కళాశాలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆన్లైన్ క్లాసులు వింటూ ఏయిర్ పోర్ట్ వద్ద అమెజాన్ కంపెనీలో పార్ట్టైం జాబు చేసుకుంటుంది.
ఈనెల 10న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంట్లో సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లింది. పలుచోట్ల ఆమె కోసం వెతికినా ఆచూకి లభించలేదు. దీంతో గురువారం పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ లో ఆమె తండ్రి శ్రీను నాయక్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.