Crime
- Oct 13, 2020 , 16:47:40
రైతుబీమా డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు

సంగారెడ్డి : రైతుబీమా డబ్బుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. నవ మాసాలు మోసి పెంచి పెద్ద చేసిన కొడుకే ఆమె పాలిట యముడయ్యాడు. రూ. 5 లక్షల రైతుబీమా డబ్బుల కోసం సొంత తల్లినే హతమార్చిన ఘటన ఏడాది తరువాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని కంగరి మండలం బాబులాగమ శివారులో ఏడాది క్రితం తులసీ బాయ్ హత్యకు గురైంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా కొడుకు పవార్ శంకర్, మనుమడు పుండలిక్తో కలిసి హత్య చేసినట్లు తేలింది. కేవలం రైతుబీమా డబ్బుల కోసం హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- వ్యాక్సిన్ల సామర్థ్యంపై బ్రిటన్ మంత్రి హెచ్చరిక
- కాలా గాజర్.. ఆరోగ్య సమస్యలు పరార్
- ఎస్సీ, ఎస్టీలకు ఇంటింటికి కొత్త పథకం : మంత్రి ఎర్రబెల్లి
- శ్రీష్టి గోస్వామి.. ఒక్క రోజు సీఎం
- బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మసీదులు కూల్చడం ఖాయం
- ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..
- గణతంత్ర దినోత్సవ అతిథులకు అభినందనలు : మంత్రి
- క్రికెట్ ఆడిన సీపీ సజ్జనార్
- విజయ్ దేవరకొండ లైగర్ షూట్ షురూ ..వీడియో
- 'గాలి సంపత్` విడుదల తేదీ ఖరారు
MOST READ
TRENDING