ములుగు : పోలీసులను హతమార్చేందుకు మావోయిస్టులు అమర్చిన మందు పాతరను ములుగు పోలీసులు నిర్వీర్యం చేశారు. ఆదివారం ఎస్.ఎస్ తాడ్వాయి ఎస్సై, స్టేషన్ సిబ్బంది, ప్రత్యేక బలగాలతో కలిసి కౌశెట్టివాయి గ్రామం నుంచి చౌలేడు వైపు కూంబింగ్ ఆపేరేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాగా గుట్ట దగ్గర ఉన్న బాటకు కొద్ది దూరంలో ఎలక్ట్రిక్ వైరు కనిపించింది. కూంబింగ్కి వచ్చే పోలీసులను హతమార్చాలనే ఉద్దేశంతో క్లైమోర్ మైన్స్ పెట్టినట్లు వారు గుర్తించారు. బాంబు డిస్పోజల్ టీంను రప్పించి మందు పాతర్లను నిర్వీర్యం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్లో ములుగు ఏఎస్పీ పోతరాజు సాయి చైతన్య, సీఐశ్రీనివాస్, తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ముఠా అరెస్ట్
ఎల్లో బికినీలో కియారా రచ్చ..!
ఉద్యమంలా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే ఆరూరి
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
పల్లెప్రగతితో మారిన జీవన పరిస్థితులు : మంత్రి ఎర్రబెల్లి